News March 26, 2025

NGKL: పెద్దకొత్తపల్లిలో 39.4 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా పెద్దకొత్తపల్లిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట 39.0, కొల్లాపూర్ 38.9, తెలకపల్లి 38.8, బిజినపల్లి 38.6, పెంట్లవెల్లి 38.4, కోడేరు 38.3, నాగర్‌కర్నూల్ 38.2, కల్వకుర్తి 38.0, ఉప్పునుంతల 37.5, బల్మూర్ 37.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 25, 2025

బిహార్‌లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

image

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

News October 25, 2025

ఏటూరునాగారం: నడుములోతు వాగు.. వృద్ధురాలి అవస్థ..!

image

ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. గత 4 నెలలుగా ముంపు గ్రామాల ప్రజల అవస్థలు వర్ణాతీతం. ఇందులో భాగంగా ఏటూరునాగారంలో జరుగుతున్న ఓ ఉచిత కంటి శిబిరానికి వెళ్లేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు నరకయాతన పడింది. నడుములోతు వాగులో దాటి యువకుల సహాయంతో ఒడ్డుకు చేరింది. వాగు తగ్గుముఖం పట్టకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు.

News October 25, 2025

హుజురాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని HZB డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును NOV 3న నడుపుతున్నట్లు DM రవీంద్రనాథ్ తెలిపారు. NOV 3న బయలుదేరిన బస్సు KNR, HYD మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తుంది. NOV 4న అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణ అనంతరం 5న తిరిగి ప్రయాణమై, 6న జోగులాంబ మీదుగా HZB చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు రూ.4,600, పిల్లలకు రూ.3,500. వివరాలకు డిపో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.