News March 22, 2025
NGKL: పెద్దకొత్తపల్లి లో38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా లో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా పెద్దకొత్తపల్లి లో 38.8 ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దూర్ 38.7, అచ్చంపేట,వంగూరు38.6, కొల్లాపూర్38.4, ఉప్పునుంతల38.3, బిజినపల్లి 38.1, కల్వకుర్తి,చారకొండ38.0, బల్మూర్37.8 తెలకపల్లి,పెంట్లవెల్లి37.5,నాగర్ కర్నూల్37.0 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 10, 2025
నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

TG: హైదరాబాద్లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
News December 10, 2025
బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
News December 10, 2025
ఆదోని జిల్లా సాధనకు నేడు బంద్.. వైసీపీ మద్దతు

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. నేడు జరగబోయే బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం పూర్తిగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధనకు వైసీపీ తరఫున మద్దతు తెలుపుతూ జిల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


