News March 5, 2025
NGKL: ప్రధానోపాధ్యాయుడిపై పోక్స్ కేసు నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం తిరుపతయ్యపై పోక్సో కేసు నమోదైంది. పాఠశాలలో చదువుతున్న బాలికను హెచ్ఎం 20 రోజుల క్రితం లైంగికంగా వేధించాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయగా హెచ్ఎంపై ఏఎస్పీ సీహెచ్ రామేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు షీటీం ఇన్ఛార్జ్ విజయలక్ష్మి తెలిపారు. ఘటనపై టీడీటీవో ఆదేశాల మేరకు ఏటీడీఓ ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News February 7, 2026
MHBD: అభ్యర్థుల చుట్టూ జనాలే.. ఓట్లు ఎవరికో..?

మహబూబాబాద్, తొర్రూర్, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో జనాలు తిరుగుతున్నారు. ఈ ఓటర్లు చివరికి.. ఓటు ఎవరికి వేస్తారు ఎవరిని అందలం ఎక్కిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు. ఈనెల 13 వరకు వేచి చూడాల్సిందే.
News February 7, 2026
రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
News February 7, 2026
రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.


