News March 24, 2025

NGKL: ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 10,537 మంది హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసే విధానాన్ని పరిశీలించారు. డీఈఓ చీఫ్ సూపరింటెండెంట్‌లకు పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేందుకు సూచనలు ఇచ్చారు.

Similar News

News November 18, 2025

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

image

TG: మహబూబ్‌నగర్‌లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

News November 18, 2025

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

image

TG: మహబూబ్‌నగర్‌లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.