News March 15, 2025

NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

image

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్‌పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్‌తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News December 24, 2025

GNT: ఆర్టీసీలో ఇక ‘ఎలక్ట్రిక్’ పరుగు.. పల్లెవెలుగు కూడా ఏసీనే.!

image

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. పల్లెవెలుగు సహా అన్నీ ఏసీ బస్సులే కావడం విశేషం. గోదావరి పుష్కరాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయి. దశలవారీగా 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీలను తేనున్నారు. 2030 నాటికి పూర్తిగా కాలుష్య రహిత బస్సులే లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎం ఈ-బస్ సేవ కింద మరో 750 బస్సులు రానున్నాయి.

News December 24, 2025

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.9℃గా నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 11.0℃గా నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 11.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌ నగర్‌లో 11.4℃ల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ఏరియాలో చలి ఎలా ఉందో కామెంట్ చేయండి.

News December 24, 2025

NTR: ఆంధ్ర టాక్సీ స్పందన కరవు.. ఆసక్తి లేదా..?

image

జిల్లాలో ఈ నెల 25 నుంచి ఆంధ్ర టాక్సీ యాప్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం 150 మంది డ్రైవర్లు మాత్రమే పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం. మొదటి నెల ఉచితంగా ఇచ్చి, ఆ తర్వాత 5% కమిషన్ వసూలు చేయనున్నారు. ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తూనే, పర్యాటక ప్యాకేజీలను కూడా చేర్చింది. ప్రైవేట్ యాప్‌కు ప్రభుత్వం ఇంతగా మద్దతు ఇవ్వడంపై విమర్శలు వస్తుండగా, డ్రైవర్లు మాత్రం నమోదుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.