News March 12, 2025
NGKL: బడ్జెట్పై జిల్లా ప్రజల్లో ఎన్నో ఆశలు.!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయింపు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు, రోడ్లు, ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
Similar News
News October 20, 2025
బెజ్జూర్: శ్రావణిది కుల దురహంకార హత్యే: ఏన్క అమృత

ఇటీవల దహేగాం మండలంలో జరిగిన గర్భిణి శ్రావణి హత్య కుల దురహంకార హత్యే అని ఆదివాసీ మహిళా సంఘం మండలాధ్యక్షురాలు ఏన్క అమృత అన్నారు. ఈరోజు బెజ్జూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిండు గర్భిణి అయిన ఆదివాసీ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన ఆమె మామ సత్తయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రెండు హత్యల కేసులు నమోదు చేయాలన్నారు.
News October 20, 2025
బాసర నుంచి మాహుర్ హైవే అనుసంధానానికి రూట్ మ్యాప్

బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి మహుర్ రేణుకా మాత మందిరం వరకు రెండు జాతీయ రహదారుల అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని ప్రస్తావించడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారని, ఈ మేరకు సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రూట్ మ్యాప్ను సిద్ధం చేశారని చెప్పారు.
News October 20, 2025
దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.