News February 1, 2025
NGKL: బాలికకు వేధింపులు.. కేసు నమోదు

ప్రేమ పేరుతో మైనర్ను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 28, 2025
మహా ప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తి

మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోకాపేటలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై.. మహా ప్రస్థానం వద్ద ముగిసింది. అంతిమయాత్రలో మాజీమంత్రి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తల కన్నీటి వీడుకోలు మధ్య సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హరీశ్ రావు తన తండ్రి సత్యనారాయణ రావు చితికి నిప్పంటించి, దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.
News October 28, 2025
పంట నష్టాన్ని రైతులు నమోదు చేసేలా యాప్లో మార్పులు: CM CBN

AP: పంట నష్టాన్ని రైతులు పంపేలా వ్యవసాయశాఖ యాప్ను మార్చాలని CM CBN ఆదేశించారు. పంట నష్టం సహ వర్షాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ‘కాకినాడకు మరిన్ని రెస్క్యూ బృందాలు పంపాలి. సీమలో వర్షాలు లేనందున చెరువుల్లో నీటిని నింపాలి’ అని సూచించారు. 43వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు నివేదించారు. 81 టవర్లతో వైర్లెస్ సిస్టమ్, 2703 జనరేటర్లు రెడీ చేశామన్నారు.
News October 28, 2025
పల్నాడు: అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిమట్టాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృత్తికా శుక్ల ఆదేశించారు. వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు, సంసిద్ధతపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.


