News February 11, 2025

NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

image

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 26, 2026

గుంటూరు: ఆ ముగ్గురు DSPలకు షాక్..!

image

ఏపీలో 2018 గ్రూప్-1 సెలక్షన్‌కు సంబంధించి అవకతవకలు, అక్రమాలు జరిగాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న గుంటూరు వెస్ట్ DSP అరవింద్, సౌత్ DSP బానోదయ, గురజాల DSP జగదీశ్ ఉన్నారు. వీరిని వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలన్నారు.

News February 26, 2026

భూపాలపల్లి: నేటి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

image

భూపాలపల్లి జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నట్లు నోడల్ అధికారి వెంకన్న తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలోని 8 కేంద్రాల్లో మొత్తం 1,936 మంది విద్యార్థులు (1,586 జనరల్, 350 ఒకేషనల్) హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News February 26, 2026

‘కాళేశ్వరం’ రుణాలు.. తగ్గిన వడ్డీ భారం

image

TG: కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹71,566Cr రుణం విడుదలైంది. వార్షిక వడ్డీ 9.45-10.90%. ఇప్పటికే కొంత చెల్లించగా ఇంకా ₹68,273Cr బాకీ ఉంది. వడ్డీని 7.5 శాతానికి తగ్గించడానికి కేంద్రం అంగీకరించడంతో ఒకేసారి ₹33,574Crను ప్రభుత్వం చెల్లించింది. మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక వాయిదాల కింద చెల్లిస్తామని తెలిపింది.