News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 7, 2026
ఒప్పో సబ్ బ్రాండ్లుగా రియల్మీ, వన్ ప్లస్.. కారణమిదే!

చైనా మొబైల్ కంపెనీలు రియల్మీ, వన్ ప్లస్ ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్లుగా మారనున్నాయి. ఒప్పో సారథ్యంలోనే ఇవి పని చేయనున్నాయి. నిజానికి ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ కంపెనీలు BBK ఎలక్ట్రానిక్స్కు చెందినవి. తాజా నిర్ణయంతో వేర్వేరుగా రీసెర్చ్&డెవలప్మెంట్, సేల్స్, లాజిస్టిక్ టీమ్స్ అవసరం ఉండదు. వనరులను సమీకరించుకుని, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో మరింత వృద్ధి చెందాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.
News January 7, 2026
మేడారంలో కనిపించిన పారిశుధ్యం

మేడారం జాతరలో పారిశుద్ధ్య పనులలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. గద్దెలకు సమీపంలోని ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఆహార అవశేషాలు, జంతు వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య కార్మికుల జాడ కనిపించడం లేదు. ముందస్తు మొక్కులు సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో పారిశుధ్యంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
News January 7, 2026
PDPL: ‘రుణాల పంపిణీ తక్కువగా ఉన్న మండలాలపై శ్రద్ధ వహించండి’

జిల్లా సమీకృత కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం సెర్ప్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ పంపిణీ రుణాల లక్ష్యం 90 శాతం పూర్తయిందని తెలిపారు. ధర్మారం, ఎలిగేడు, శ్రీరాంపూర్, ముత్తారం మండలంలో తక్కువగా ఉందని, ఆయా మండలాల్లో రుణాల పంపిణీ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.


