News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 23, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్లో <
News December 23, 2025
ఉద్యోగాలు లేక విదేశాలవైపు యువత చూపు!

విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ యువతే ఎక్కువగా ఉందని <<18646531>>నీతి ఆయోగ్<<>> స్పష్టం చేసింది. యువతకు ఉద్యోగాలు దొరకకపోవడం కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తోంది. 2025లో రాష్ట్రంలో నిరుద్యోగం 8 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు(5.2%) కంటే ఎక్కువ. నిరుద్యోగుల్లో ఎక్కువమంది డిగ్రీ చేసిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నా నాణ్యమైన ఇన్స్టిట్యూట్స్ లేవని యువత భావిస్తోంది.
News December 23, 2025
అల్లూరి: అనారోగ్యంతో విద్యార్థి మృతి

వై. రామవరం మండలం మునసలపాలెం గ్రామానికి చెందిన బి.సాయికుమార్ రెడ్డి (8) అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం ఇంటివద్దే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. వెదురునగరం పాఠశాలలో 3వ తరగతి చదువుతూ ఓ హాస్టల్లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా జ్వరం, పచ్చకామెర్లుతో బాధ పడుతుండంతో ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందజేస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


