News February 22, 2025
NGKL: మట్టి కుంగడంతో ప్రమాదం: మంత్రి ఉత్తమ్

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఇవాళ ఉదయం ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. టన్నెల్లో ఒక భాగం నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగి ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు. ఉ.8 గంటలకు కార్మికులు లోపలికి వెళ్లారు. ఉ.8.30 గంటలకు బోరింగ్ మిషన్ను ప్రారంభించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు మంత్రి తెలిపారు.
Similar News
News December 3, 2025
ప్రకటనే పవన్ సమాధానమా?

తెలంగాణకు పవన్ <<18446578>>క్షమాపణలు<<>> చెప్పాలన్న డిమాండ్ల నేపథ్యంలో జనసేన నుంచి వెలువడిన <<18451648>>ప్రకటన<<>> చర్చనీయాంశమైంది. ఇదే ఆయన సమాధానమా? ప్రత్యేకంగా మాట్లాడరా? ప్రకటనతో వివాదం ముగుస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు Dy.CM హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి ఆయన త్వరగా ముగింపు పలకాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
జగిత్యాల కళాశాలలో వసతులపై ఆడిట్ బృందం సంతృప్తి

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు అకాడమిక్ ఆడిట్ బృందం నేడు తనిఖీ చేసింది. హుజురాబాద్ ప్రిన్సిపల్ డా. పి. ఇందిరా దేవి, డా. శ్రీనివాస్ విభాగాలను పరిశీలించారు. అధ్యాపకులు విద్యార్థుల విజయాలను వివరించారు. వసతులు, వనరులపై ఆడిట్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశంలో ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ, స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.
News December 3, 2025
VHTలో ఆడనున్న విరాట్ కోహ్లీ!

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో ఆడేందుకు విరాట్ కోహ్లీ అంగీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ధ్రువీకరించారని తెలిపింది. DEC 24 నుంచి జరగనున్న ఈ టోర్నీలో కోహ్లీ 3 మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే ఛాన్సుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆయన ఈ టోర్నీలో ఆడనున్నారు. అటు రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడే అవకాశముంది.


