News February 22, 2025

NGKL: మట్టి కుంగడంతో ప్రమాదం: మంత్రి ఉత్తమ్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఇవాళ ఉదయం ఎస్ఎల్బిసి టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. టన్నెల్‌లో ఒక భాగం నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగి ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు. ఉ.8 గంటలకు కార్మికులు లోపలికి వెళ్లారు. ఉ.8.30 గంటలకు బోరింగ్ మిషన్‌ను ప్రారంభించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు మంత్రి తెలిపారు.

Similar News

News October 14, 2025

హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్.. నేడే విచారణ!

image

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్‌గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.

News October 14, 2025

మెదక్: కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి..

image

మెదక్(D) నిజాంపేటలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి చెందాడనే మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన జ్యోతి(41) బతుకుదెరువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లారు. అక్కడ ఆమె కొడుకు అనిల్ నెల రోజుల క్రితం పిట్స్ రావటంతో ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు SI రాజేశ్ కేసు నమోదు చేశారు.

News October 14, 2025

పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

image

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.