News March 29, 2025

NGKL: మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం..!

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం చెలరేగిందని స్థానికులు తెలిపారు. ఈనెల 25న జూనియర్ విద్యార్థి, రాజస్థాన్‌కు చెందిన దీపక్ శర్మను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు.

Similar News

News November 16, 2025

కామారెడ్డి: చికెన్, మటన్ ధరలు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, ఉండగా చికెన్ స్కిన్ రూ.210 -220, స్కిన్ లెస్ రూ.230-240, లైవ్ కోడి రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విక్రయాలు సాధారణంగా ఉన్నాయని దుకాణాలు తెలిపారు.

News November 16, 2025

గద్వాల్ స్టేషన్‌లో ఆగే రైళ్లు ఇవే..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT

News November 16, 2025

రేపు తిరుచానూరుకు రాష్ట్ర మంత్రి రాక..

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3 నుంచి 5 గంటల వరకు తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.