News February 1, 2025
NGKL: మైనర్ బాలికకు వేధింపులు.. కేసు నమోదు

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 9, 2026
175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. కావలి లాస్ట్.!

ఏపీలో వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాల్లో వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. A+ గ్రేడ్లో 21, A గ్రేడ్లో 153, B గ్రేడ్లో ఒక నియోజకవర్గం ఉన్నాయి. అలాగే, 90 % కంటే ఎక్కువ మార్కులు సాధించి A+ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కావలి(78) చివరి నుంచి మూడోస్థానం, కందుకూరు(78) మార్కులతో రాష్ట్రంలో చివరి నుంచి నాలుగో స్థానానికి పడిపోయాయి.
News February 9, 2026
రాజధాని పనులకు గ్రీన్ ఛానల్లో గ్రావెల్: కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు,కార్యదర్శుల మూడో సదస్సు జరిగింది. ఈ సదస్సుకి కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ మ్యూచువల్గా హాజరయ్యారు. ఈ సదస్సులో జరిగిన చర్చ సందర్భంగా గ్రావెల్, మెటీరియల్ సరఫరాకు ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా జిల్లాలో తీసుకుంటున్న చర్యలను సీఎంకి వివరించారు. ఇటీవల జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీ సమావేశం కూడా నిర్వహించినట్లు తెలిపారు.
News February 9, 2026
‘సావర్కర్కు భారతరత్న’పై మాటల మంటలు

వీర్ సావర్కర్కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.


