News March 6, 2025
NGKL: యువకుడి ఆత్మహత్య

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన కేతావత్ మైబు నాయక్(23) బుధవారం సాయంత్రం మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు. మైబు నాయక్ అందరితో ప్రేమగా, మైత్రిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.
Similar News
News October 14, 2025
ఏలూరు: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి తన ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్-1లో ఉంటున్న సాయిలక్ష్మి(27) తన రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. సాయిలక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు.
News October 14, 2025
BREAKING: నూజివీడు: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో నూజివీడుకు చెందిన సాయిలక్ష్మి (27) ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్-1లో నివసిస్తున్న ఆమె చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 14, 2025
మదనపల్లె యువకుడికి 20ఏళ్ల జైలుశిక్ష

అత్యాచారం కేసులో ఓ యువకుడికి కఠిన శిక్ష పడింది. మదనపల్లెలోని బసినికొండకు చెందిన బాలికకు ప్రసాద్(23) 2021లో మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో తాలూకా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు.