News April 1, 2025
NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.
Similar News
News November 17, 2025
GNT: యోగా పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై, ఆగస్టు నెలలో యోగ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా సెకండ్ సెమిస్టర్, ఎమ్మెస్సీ యోగా ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 26వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
News November 17, 2025
GNT: యోగా పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై, ఆగస్టు నెలలో యోగ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా సెకండ్ సెమిస్టర్, ఎమ్మెస్సీ యోగా ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 26వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
News November 17, 2025
వనపర్తి: ధాన్యం ఆన్లైన్ ఎంట్రీలో ఆలస్యం.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 291 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇందులో 10,682 MT ధాన్యాన్ని మిల్లులకు తరలించినా, 6 వేల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఆన్లైన్ ఎంట్రీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.


