News February 23, 2025
NGKL: యువతి SUICIDE

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.
Similar News
News December 9, 2025
KMR: తొలి దశ పోలింగ్కు రంగం సిద్ధం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ర్యాండమైజేషన్ జరిగింది. మొదటి దశలో జీపీలు 157, 1444 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి 1457 టీములకు సంబంధించిన మండలాల వారీగా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
News December 9, 2025
మొదటి దశ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది.157 గ్రామ పంచాయతీలు, 1444 వార్డుల్లో ఎన్నికల విధులకు అవసరమైన 1457 టీములను ఆయా గ్రామ పంచాయతీలకు నియమించారు.
News December 9, 2025
పోలింగ్ సిబ్బందికి మూడో ర్యాండమైజేషన్ పూర్తి

భూపాలపల్లి డివిజన్ పరిధి గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్లపల్లి మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. 73 గ్రామ పంచాయతీల్లోని 559 వార్డులకు విధులు నిర్వర్తించే 855 ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), 1084 మంది ఓపీఓలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం టీ పోల్ పోర్టల్ ద్వారా మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.


