News December 16, 2024
NGKL: రైతులకు అందుబాటులో వరి విత్తనాలు

నాగర్కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో వరి విత్తనాలు ఉన్నాయని విత్తన సరఫరా విభాగం అధికారులు రామకృష్ణ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. RNR 15048 రకం అందుబాటులో ఉన్నాయని, 20 కేజీల ప్యాకెట్ ధర రూ.1060 అందజేస్తున్నట్లు తెలిపారు. కావలసిన రైతులు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు.
Similar News
News December 1, 2025
MBNR: మహిళలను వేధిస్తే 8712659365 కాల్ చేయండి

పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే 8712659365 నంబర్కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం తమ షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 1, 2025
ALERT: నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు- SP

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలు సమర్థంగా కొనసాగేందుకు డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేనిదే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్(సభలు) నిర్వహించరాదన్నారు.
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.


