News February 1, 2025

NGKL: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందిస్తాం: ఎమ్మెల్సీ

image

రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మండలంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పనికట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

Similar News

News November 18, 2025

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

image

ముంబైలోని <>జనరల్<<>> ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 ఆక్చువేరియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 18, 2025

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

image

ముంబైలోని <>జనరల్<<>> ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 ఆక్చువేరియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 18, 2025

పెద్దపల్లి: ‘నిషేధిత ఔషధాలు విక్రయించవద్దు’

image

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్ కుమార్ మెడికల్ షాపు యజమానులను సూచించారు. పెద్దపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో సోమవారం ఔషధ దుకాణాలలో ఆయన తనిఖీలు నిర్వహించారు. GST స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలన్నారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.