News February 18, 2025
NGKL: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 34 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News December 5, 2025
పుతిన్కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
News December 5, 2025
NRPT: మూడోదశ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభం

నారాయణపేట జిల్లాలోని మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, మక్తల్, నర్వ మండలాల పరిధిలో సర్పంచ్, వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామపంచాయతీలు, 994 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో డిసెంబర్ 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల ఓటింగ్ వేయడానికి అవకాశం కల్పించి మధ్యాహ్నం 02 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభిస్తారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
News December 5, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో ఇంటి పోరు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది.పలు గ్రామాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిపైనే సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. పెద్దఎత్తున నామినేషన్లు రావడంతో కొందరు విత్ డ్రా చేసుకున్నప్పటికీ మరికొందరు నేతలు విరమించేందుకు యత్నాలు చేసినా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు రంగంలోకి దిగారు.


