News February 18, 2025
NGKL: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 34 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 10, 2026
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(2/2)

చెరకు ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి ప్లాస్టిక్ షీట్లతో గాలి తగలకుండా కప్పాలి. మొలకెత్తిన ట్రేలను 4వ రోజు గ్రీన్హౌస్లోకి మార్చుకొని రోజు విడిచి రోజు నీటితో తడపాలి. విత్తు పొడవు 5 సెం.మీ. ట్రై క్యావిటీ 98 సి.సి కలిగినవి అయితే మొలకలు 25-30 రోజుల వరకు ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి వస్తాయి. బడ్ చిప్ పద్ధతిలో నారు పెంచడానికి లేత తోటల నుంచి పురుగులు, తెగుళ్లు ఆశించని గడలనే ఎంపిక చేసుకోవాలి.
News January 10, 2026
తుర్కపల్లి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఆరుగురు అరెస్ట్

మాదాపూర్ గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై తక్యుద్దీన్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక హిటాచీ, కారు, పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 10, 2026
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..! సమాచారం ఇవ్వండి- ఎస్పీ

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని విలువైన వస్తువులు లాకర్ల లోనే భద్రపరుచుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి విజ్ఞప్తి చేశారు. పండుగకు ఊర్లకు వెళ్తారని ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్లో భాగంగా ఆయా ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అన్నారు.


