News February 13, 2025

NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్‌పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వద్దు.. గ్రామం ముద్దు
▶జిల్లాలో పలుచోట్ల యూరియా కోసం రైతుల అవస్థలు
▶SKLM: ఎంపీ నిధులతో ప్రాంతీయ ప్రాంతాల అభివృద్ధి
▶GST 2.0పై మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష
▶బూర్జ: ధర్మల్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలి
▶పొందూరు: ఈ ప్రయాణాలు..ప్రమాదం
▶సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శంకర్
▶రైతు సమస్యలపై సభలో చర్చిస్తాం: అచ్చెన్నాయుడు

News September 18, 2025

డోర్నకల్: అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన డీఎస్ రవిచంద్ర

image

మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి డీఎస్ రవిచంద్ర గురువారం రాజీనామా చేశారు. తన వ్యక్తిగతమైన కారణాలు, కార్యక్రమాలతో అసోసియేషన్ కోసం అధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నానని, అందువల్లనే మరొకరికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రవిచంద్ర దశాబ్ద కాలానికి పైగా అధ్యక్ష పదవిలో ఏకగ్రీవంగా కొనసాగుతున్నారు.

News September 18, 2025

మంచిర్యాల: సింగరేణిలో ఈపీ ఆపరేటర్లకు శుభవార్త

image

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు శుభవార్త.. ఎక్స్ కవేషన్ కేటగిరీ- డి నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి, ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-బికి త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 150 మంది ఆపరేటర్లు పదోన్నతి పొందనున్నారు. కేటగిరీ- డిలో రెండేళ్లు, కేటగిరీ- సిలో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.