News March 17, 2025
NGKL: వలస కార్మికుడి మృతి

కొల్లాపూర్ మండలంలో ఓ వలస కార్మికుడు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. అస్సాంలోని మాదాపూర్కి చెందిన వినోద్దాస్(35) ఎల్లూరు శివారులో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేసేందుకు వలస వచ్చాడు. ఆదివారం మద్యం తాగి నడుస్తుండగా రాయి తగిలి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Similar News
News November 18, 2025
బోడుప్పల్: తలనొప్పిగా మారుతున్న స్పామ్ కాల్స్..!

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి రవి విసుగెత్తి నెట్ వర్క్ ప్రొవైడ్ అధికారులకు కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తన పనికి పదేపదే ఆటంకం కలుగుతుందని, అంతేకాక, సైబర్ నేరగాళ్లు సైతం పలుమార్లు కాల్ చేసినట్లు ఆయన ఫిర్యాదులు పొందుపరిచారు.
News November 18, 2025
బోడుప్పల్: తలనొప్పిగా మారుతున్న స్పామ్ కాల్స్..!

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి రవి విసుగెత్తి నెట్ వర్క్ ప్రొవైడ్ అధికారులకు కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తన పనికి పదేపదే ఆటంకం కలుగుతుందని, అంతేకాక, సైబర్ నేరగాళ్లు సైతం పలుమార్లు కాల్ చేసినట్లు ఆయన ఫిర్యాదులు పొందుపరిచారు.
News November 18, 2025
నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.


