News February 4, 2025
NGKL: విద్యుత్ షాక్తో ఒకరి మృతి

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
ఆన్లైన్లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్లైన్లో అసభ్య మెసేజ్లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
News November 19, 2025
ఖమ్మం: యువ అభివృద్ధి పథకం.. దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ యువ కౌమార అభివృద్ధి పథకం ద్వారా గ్రాంట్-ఇన్-ఎయిడ్(జీఐఏ) కోసం ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, నాన్- గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు(NGO)ఈ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీఐఏ పోర్టల్ ద్వారా మాత్రమే అందిన దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


