News April 14, 2025
NGKL: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

బల్మూర్ మండలంలో కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. జిన్కుంటకు చెందిన దనుంజయ్(30) కేఎల్ఐ కాల్వలో విద్యుత్ వైర్లు కర్రకు చుట్టి చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News February 25, 2026
గుంటూరు వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్లో 14 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు స్వశక్తి భవన్ను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
రాష్ట్ర సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జట్టుకు ద్వితీయ స్థానం

వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు. క్రీడాకారుల కృషి, క్రమశిక్షణ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.
News February 25, 2026
నెతన్యాహు ‘హెక్సాగన్’ ప్లాన్: భారత్ కీలకం!

మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ నెతన్యాహు ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ అనే కొత్త కూటమిని ప్రతిపాదించారు. తీవ్రవాద శక్తులను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లతో ఈ కూటమి ఏర్పడనుంది. పాక్-సౌదీల నాటో తరహా ఒప్పందానికి పోటీగా ఇది రానుంది. భారత్ను ఈ వ్యూహాత్మక కూటమిలో కీలక భాగస్వామిగా నెతన్యాహు అభివర్ణించారు. నేడు, రేపు (Feb 25, 26) ఇజ్రాయెల్లో మోదీ పర్యటించనున్నారు.


