News April 14, 2025
NGKL: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

బల్మూర్ మండలంలో కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. జిన్కుంటకు చెందిన దనుంజయ్(30) కేఎల్ఐ కాల్వలో విద్యుత్ వైర్లు కర్రకు చుట్టి చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News April 20, 2025
‘చట్టాలన్ని ఆడవారికే’ .. భార్య టార్చర్తో భర్త సూసైడ్

భార్య వేధింపులు తాళలేక యూపీలో మోహిత్ కుమార్ అనే ఫీల్డ్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తినంతా భార్య వారి కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని, లేకుంటే తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలన్నీఆడవారికే అనుకూలంగా ఉన్నాయని, మగవారిని రక్షించేలా చట్టాలుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియో రికార్డు చేసి ప్రాణాలు వదిలారు.
News April 20, 2025
మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో కీలకంగా ఉన్న VFX కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వీటి కోసమే UV క్రియేషన్స్ రూ.75 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సోషియో ఫాంటసీ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల కానున్నట్లు సమాచారం.
News April 20, 2025
గుంటూరు: 19 పరుగులు చేసిన రషీద్

వాంఖండే వేదికగా జరుగతున్న చైన్నై -ముంబాయి మ్యాచ్లో గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ ఆదివారం పర్వాలేదనింపించారు. ఓపెనర్గా వచ్చి 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. శాంట్నర్ వేసిన బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యి వెనుదిరిగారు. కాగా.. దీనికంటే ముందు మ్యాచ్లో ఆరంగేట్రం చేసిన రషీద్ 27 పరుగులు చేసిన విషయం తెలిసిందే.