News February 21, 2025
NGKL: వివాహిత అదృశ్యం

ముగ్గురు పిల్లలతో సహా ఓ వివాహిత కనిపించకుండాపోయిన ఘటన తెలకపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. నడిగడ్డకు చెందిన చోటేమియాతో ఇర్ఫానాబేగంకు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. చోటేమియా అధిక వడ్డీ ఆశచూపి రూ.లక్షలు దోచుకోవటంతో జైలుకెళ్లాడు. దీంతో ఇర్ఫానాబేగం పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. చోటేమియా జైలునుంచి రావటంతో ఈమె పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈమేరకు కేసునమోదైంది.
Similar News
News November 18, 2025
రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
News November 18, 2025
రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
News November 18, 2025
ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.


