News February 21, 2025
NGKL: వివాహిత అదృశ్యం

ముగ్గురు పిల్లలతో సహా ఓ వివాహిత కనిపించకుండాపోయిన ఘటన తెలకపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. నడిగడ్డకు చెందిన చోటేమియాతో ఇర్ఫానాబేగంకు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. చోటేమియా అధిక వడ్డీ ఆశచూపి రూ.లక్షలు దోచుకోవటంతో జైలుకెళ్లాడు. దీంతో ఇర్ఫానాబేగం పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. చోటేమియా జైలునుంచి రావటంతో ఈమె పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈమేరకు కేసునమోదైంది.
Similar News
News November 20, 2025
కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.
News November 20, 2025
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 2 కోట్ల 3 లక్షల 25 వేల 676 వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. హుండీ ద్వారా 228 గ్రాముల బంగారం, 14 కిలోల 300 గ్రాముల వెండి సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది, ఎస్ఎఫ్ఐ, హోంగార్డుల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.
News November 20, 2025
బోర్డులను “బ్రోకర్ల డెన్”లుగా మార్చారు: సంజయ్

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.


