News January 28, 2025

NGKL: ‘సమయపాలన పాటించకపోతే చర్యలు’

image

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని నగర్ కర్నూల్ జిల్లా డీఈవో రమేష్ కుమార్ హెచ్చరించారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తరలించారు. తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Similar News

News December 20, 2025

Unbelievable: ఈ వెజిటెబుల్ కేజీ రూ.లక్ష

image

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరల్లో హాప్ షూట్స్ ఒకటి. భారత మార్కెట్‌లో కేజీ రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటిలోని హ్యుములోన్, లుపులోన్ యాసిడ్స్ క్యాన్సర్ సెల్స్‌తో పోరాడుతాయని సైంటిస్టులు చెబుతారు. TB వంటి సీరియస్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగిస్తారు. బిహార్, HPలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. వందల హాప్ షూట్స్ కలిస్తేనే కేజీ వరకు తూగడం, పండించడంలో సవాళ్లు, కోతలో కష్టమూ భారీ ధరకు కారణాలు.

News December 20, 2025

మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ASF SP

image

ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసు నమోదు చేస్తామని ASF జిల్లా SP నితికా పంత్ తెలిపారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని సూచించారు.

News December 20, 2025

సిరిసిల్ల: ‘ఫెర్టిలైజర్ యాప్‌లోనే ఎరువుల బుకింగ్’

image

ఫెర్టిలైజర్ యాప్‌ను రైతులు డౌన్లోడ్ చేసుకునే విధంగా చూడాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పిఎసిఎస్ సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫెర్టిలైజర్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, యాప్‌కు సంబంధించిన వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాలని అన్నారు. యాప్ ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.