News January 28, 2025
NGKL: ‘సమయపాలన పాటించకపోతే చర్యలు’

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని నగర్ కర్నూల్ జిల్లా డీఈవో రమేష్ కుమార్ హెచ్చరించారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తరలించారు. తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Similar News
News November 27, 2025
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్పై కామెంట్స్.. SRనగర్లో ఫిర్యాదు

సింగర్ మంగ్లీ తన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’పై జనాదరణ పొందింది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
2 జిల్లాల్లో నియోజకవర్గం.. తొలిదశలోనే పోలింగ్..!

రెండు జిల్లాలలో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో ఒకేసారి జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లో 85, జగిత్యాల జిల్లాలో 3 మండలాల్లో 44 పంచాయతీలు ఉండగా, నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ అనంతరం 11న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.


