News April 14, 2025

NGKL: సళేశ్వరం జాతర చివరి రోజు అపశ్రుతి

image

సళేశ్వరం జాతర చివరి రోజు స్వల్ప అపశ్రుతి జరిగింది. రద్దీ అధికంగా ఉండడంతో బస్సులో సీటు పట్టేందుకు వెళ్లి ఓ మహిళ గాయపడ్డారు. దర్శనం అనంతరం మహిళ రాంపూర్ పెంట వద్ద బస్సు రాగానే సీటు కోసం పరిగెత్తారు. డ్రైవర్ బస్సును తిప్పి పెట్టడానికి ప్రయత్నించగా మహిళ వెనక నుంచి వచ్చి టైర్ కింద పడబోయారు. ఘటనలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. డ్రైవర్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Similar News

News November 1, 2025

RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

image

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 1, 2025

హాట్ టాపిక్‌గా సీఎంకు స్వాగతం పలికిన MLA దొంతి సీన్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు దెబ్బతినడంతో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌కి వచ్చారు. సీఎంకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటిసారిగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వరంగల్‌కు సీఎం ఎప్పుడొచ్చినా ఆ కార్యక్రమాల్లో దొంతి కనిపించలేదు. కానీ, మొదటిసారి రావడంపై హాట్ టాపిక్‌గా మారింది.

News November 1, 2025

భద్రకాళి అమ్మారిని దర్శించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

image

వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.