News March 22, 2025
NGKL: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి, తోటి శాసనసభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, రాష్ట్ర IT పరిశ్రమ, వాణిజ్యం & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి, ఆరోగ్య శాఖ సంబంధిత అంశాలపై చర్చించారు.
Similar News
News December 1, 2025
AP NIT, YSR ఉద్యాన వర్సిటీ మధ్య MOU

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్(AP NIT)తో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. డ్రోన్ టెక్నాలజీ, డ్రయ్యర్ టెక్నాలజీ, నీటి పారుదలలో ఆధునిక యాంత్రికరణ, తెగుళ్లు గుర్తించడం, నానో టెక్నాలజీ తదితర అంశాల్లో రైతులకు అవగాహన కల్పించి ఖర్చులు తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఏపీ నిట్ డైరెక్టర్ రమణ రావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు.
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
News December 1, 2025
అమరావతిలో సచివాలయ టవర్లకు అరుదైన రికార్డ్లు

అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్మాణ దశలోనే ఇవి పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ‘డయాగ్రిడ్’ నిర్మాణం. దీనివల్ల పిల్లర్ల సంఖ్య తగ్గి, భవనం అద్భుతంగా కనిపిస్తుంది. జపాన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ ఎత్తైన సచివాలయ టవర్గా (212 మీటర్లు) ఇది రికార్డు సృష్టించనుంది. ఇది 200 మీటర్ల ఎత్తు దాటిన ఏపీలోని మొదటి స్కైస్క్రాపర్.


