News April 2, 2025
NGKL: సైబర్ నేరాలపై పోలీస్ శాఖ అవగాహన సదస్సు

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ(ఆర్ట్స్) కాలేజీలో నేడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహించింది. కార్యక్రమంలో జిల్లా టౌన్ SI గోవర్ధన్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు ఎవరైనా గురైతే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, పోలీస్ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 760 పాయింట్ల లాభంతో 85,200 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల గెయిన్తో 26,085 వద్ద కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ లాభాల్లో ఉండగా, మారుతి సుజుకీ, అపోలో హాస్పిటల్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏడాది తర్వాత నిఫ్టీ 26 వేలు, సెన్సెక్స్ 85 వేల మార్కును చేరుకోవడం గమనార్హం.
News October 23, 2025
మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు

తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో గడువు ముగియనుంది. 2,620 మద్యం షాపులకు ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 5 PM వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అప్లికేషన్లు లక్షకు చేరువయ్యే ఛాన్స్ ఉంది. ఈనెల 27న లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది. అయితే దరఖాస్తు గడువు ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మరోసారి పెంచే ఛాన్స్ ఉండకపోవచ్చు.
News October 23, 2025
నిద్రను వీడే సమయం బట్టే మానవ ఆయుర్దాయం

రాత్రి చివరి భాగానికి ఉషస్సు అని పేరు. మానవులందరూ ఉషఃకాలంలోనే నిద్రలేవాలి. స్నానానంతరం పరమేశ్వరుని ధ్యానించి ఆ రోజు చేయవలసిన ధర్మాధర్మ కృత్యాలను గురించి, ఆదాయ వ్యయాలను గురించి ఆలోచించాలి. నిదుర లేచే సమయాన్ని, పద్ధతిని బట్టే మానవుని ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి, శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని శ్రీ శివ మహాపురాణం చెబుతోంది.
<<-se>>#SIVOHAM<<>>