News March 14, 2025

NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌ప‌ల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.

Similar News

News September 18, 2025

VJA: GST ఎఫెక్ట్.. ఈ నెల 22 నుంచి LED టీవీలు, ACలపై భారీ ఆఫర్లు

image

GST తగ్గింపుతో ఈ నెల 22 నుంచి LED టీవీలు, డిష్‌వాషర్లు, ACలపై భారీ ఆఫర్లు ప్రకటించామని విజయవాడ సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి తెలిపారు. GST తగ్గింపు, దసరా ఆఫర్స్‌తో 22 నుంచి LED టీవీలు, డిష్‌వాషర్లు, ACలు, వాషింగ్ మెషిన్స్, ల్యాప్‌‌ట్యాప్స్, మొబైల్స్ డిస్కౌంట్‌లతో, EMI, ఫైనాన్స్ కొనుగోలుపై 15% క్యాష్‌బ్యాక్, స్క్రాచ్ కార్డు ఆఫర్స్ గృహోపకరణాలు సోనోవిజన్‌లో లభిస్తాయన్నారు.

News September 18, 2025

మంచిర్యాల జిల్లాలో 12.8 మి.మీ. వర్షపాతం నమోదు

image

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 12.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా కాసిపేట మండలంలో 64.2 మి.మీ నమోదైంది. జన్నారం 0.4, దండేపల్లి 2.2, లక్షెట్టిపేట3.0, హాజీపూర్ 6.4,తాండూర్ 34.6, భీమిని 2.8, కన్నేపల్లి1.4, వేమనపల్లి 0.0, నెన్నల 1.0, బెల్లంపల్లి 32.0, మందమర్రి 17.2, మంచిర్యాల 29.4, నస్పూర్ 15.4, జైపూర్ 1.6, భీమారం 20.4, చెన్నూర్ 00, కోటపల్లి 00 మి.మీ. వర్షం కురిసింది.

News September 18, 2025

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బదిలీ

image

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన్ను ములుగు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవోగా) నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ములుగు హెడ్ క్వార్టర్‌కు బదిలీ అయ్యారు. కాగా ప్రస్తుతం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం సబ్ డివిజనల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు బదిలీపై ఆయన ములుగు వెళ్లనున్నారు.