News March 14, 2025
NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్కు భార్య, ఇద్దరు పిల్లలు.
Similar News
News February 26, 2026
పార్వతీపురం: ‘వాహనాలకు ఎల్ఈడీ లైట్లు ఉపయోగించకూడదు’

రవాణా శాఖ పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఎల్ఈడీ లైట్లు ఉపయోగించకూడదని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో రవాణా శాఖ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర మలుపుల్లో గుర్తింపు చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు.
News February 26, 2026
T20 WC: టాస్ ఓడిన భారత్

చెన్నై వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచులో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా జట్టులో 2 మార్పులు జరిగాయి. రింకూ స్థానంలో సంజూ, సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
IND: సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్, వరుణ్, బుమ్రా.
ZIM: మారుమని, బెనెట్, మేయర్స్, బర్ల్, రజా, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, మపోసా, ముజరబని, ఎంగర్వ.
News February 26, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.


