News October 6, 2025
NGKL: అండర్-19.. 8న కబడ్డీ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 8న బాల, బాలికల U/19 కబడ్డీ ఎంపికలు ఉంటాయని నాగర్ కర్నూల్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. MBNRలోని స్టేడియంలో ఉ. 9:00 గం. ఎంపికలు ఉంటాయని, 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులని, బాలురు 70 కేజీలు, బాలికలు,65 కేజీల బరువు కలిగి ఉండాలని, ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్, ఆధార్ తీసుకొని రావాలన్నారు.
Similar News
News October 6, 2025
జిల్లాలో యూరియా నిల్వలున్నాయ్: కలెక్టర్

జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఆర్ఎస్కేలు, ప్యాక్స్ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 186 మెట్రిక్ టన్నుల యూరియాను 1,945 మంది రైతులకు అందజేసినట్లు ప్రకటించారు. అదనంగా 166 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉన్నందున అవసరమైన రైతులు సమీప కేంద్రాలకు వెళ్లి పొందవచ్చని సూచించారు.
News October 6, 2025
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను ఆమోదించిన నేపథ్యంలో, పార్కులో అత్యాధునిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పార్క్ నిర్మాణ పురోగతిపై సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News October 6, 2025
ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

CJI BR గవాయ్పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.