News February 12, 2025
NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739321484557_1292-normal-WIFI.webp)
అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.
Similar News
News February 12, 2025
HYDలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337913904_15795120-normal-WIFI.webp)
HYD,SECలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు indiapostgdsonline.gov.inవెబ్సైట్లో తపాలాశాఖ నోటిఫికేషన్ విడుదలైంది. HYD SORTING- డాక్ సేవక్ 27, HYD సౌత్ ఈస్ట్-డాక్ 22, GDS 19, HYD సిటీ- డాక్సేవక్ -7, సికింద్రాబాద్-డాక్సేవక్ 12, GDS-12 ఉన్నాయి. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40 మధ్య ఉండాలి. సైకిల్,బైక్ నడపగలగాలి. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100, మిగిలిన వారికి ఉచితం.
News February 12, 2025
హైదరాబాద్లో 99 తపాలా పోస్టులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337598586_51765059-normal-WIFI.webp)
పోస్టల్ శాఖలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్, బైక్ నడపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. #SHARE IT
News February 12, 2025
కరీంనగర్ జిల్లా పరిధిలోని ఓటర్ల వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739332563921_20488454-normal-WIFI.webp)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 1,229 గ్రామ పంచాయతీలు, 649ఎంపీటీసీ స్థానాలు, 18,77,570 మంది ఓటర్లు ఉన్నారు. JTLజిల్లాలో385జీపీలు, 3,536 వార్డులు, 216ఎంపీటీసీలు, 6.09.496 మంది, KNR జిల్లాలో 318 జీపీలు, 2,962 వార్డులు,170ఎంపీటీసీలు, 5.08,489, PDPLజిల్లాలో 266 జీపీలు, 2,486 వార్డులు,140 ఎంపీటీసీలు, 4,13,306, SRSLజిల్లాలో 260 పంచాయతీలు, 2,268 వార్డులు, 123 ఎంపీటీసీ లు. 3,53,796 మంది ఓటర్లు ఉన్నారు.