News April 2, 2025
NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. దుండగులను శిక్షించాలని డిమాండ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ఊరుకొండ ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు పరుశురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులు కావద్దని వారన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు.
Similar News
News December 30, 2025
NTR: డబ్బులు వసూలు చేసి తెస్తుండగా ప్రమాదం..!

ఎలమంచిలి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో 2 భోగీలు కాలిపోవడంతో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) మృతి చెందిన విషయం తెలిసిందే. అతని వద్ద ఉన్న బ్యాగులో రూ.6 లక్షల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను హోల్ సేల్ వస్త్ర వ్యాపారి అని, విజయనగరం నుంచి డబ్బులు వసూలు చేసుకుని విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తుని ప్రభుత్వ రైల్వే ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.
News December 30, 2025
ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>
News December 30, 2025
హమాస్కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.


