News April 3, 2025

NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

image

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Similar News

News December 19, 2025

మరోసారి అట్టుడుకుతున్న బంగ్లా

image

బంగ్లాదేశ్‌లో హాదీ <<18610392>>మృతితో<<>> ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పంటించగా అర్ధరాత్రి బంగ్లా బగబంధు ముజిబుర్ రెహ్మాన్ ఇంటిని తగలబెట్టారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లను ధ్వంసం చేశారు. తాజా ఘటనలు ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను తలపిస్తున్నాయి. అప్పుడు కూడా ముజిబుర్ ఇంటిపై దాడి జరిగింది.

News December 19, 2025

HYD: రాష్ట్రపతి రాక..నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు..!

image

నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ మీదుగా వెళ్లనుండగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారు. నాగోల్ మూసి బ్రిడ్జి నుంచి, జెన్ పాక్ట్ వరకు జంక్షన్లు, యూటర్న్ ఉదయం 8 నుంచి సా.4:30 వరకు ముసి ఉంచటం, డైవర్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

News December 19, 2025

క్లెయిమ్ చేయని ఆస్తులపై 20న అవగాహన శిబిరం

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం డిసెంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఉదయాదిత్య భవనంలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.