News April 9, 2025
NGKL: ‘ఆదాయ అభివృద్ధికై వ్యవసాయ పరిశోధనలు సాగాలి’

బిజినేపల్లి మండల పరిధి పాలెంలో ప్రొ.జయశంకర్ దక్షిణ తెలంగాణ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఆడిటోరియంలో వ్యవసాయ విస్తరణ, సలహా సంఘ సమావేశానికి కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాబోయే వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా పరిశోధనలు ఉండాలన్నారు. రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి వ్యవసాయం చేయాలని సూచించారు.
Similar News
News October 20, 2025
ADB: ‘బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ముఖం దగ్గరగా పెట్టి బాణసంచా కాల్చకండి. మీ పిల్లల పక్కనే మీరు ఉండి టపాసులు కాల్చండి. పేలని టపాసుల వద్దకు వెళ్ళకూడదు. అవి ఎప్పుడు పేలేది తెలియాదు. బాగా పొగ ఎక్కువ వచ్చే టపాసులను కాల్చకూడదు. దీనివల్ల ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది.
News October 20, 2025
దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.
News October 20, 2025
దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.