News February 15, 2025
NGKL: ఈ నెల 19వ తేదీ నుంచి 24 గంటలూ అనుమతి

నాగర్ కర్నూల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతి ఉంటుందని శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణికులను, వాహనాలను అనుమతించరు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 28, 2026
ఈ ‘1% రూల్’తో సంపదను పెంచుకోండి!

పర్సనల్ ఫైనాన్స్లో 1% రూల్ సంపదను పెంచే ఒక సింపుల్ స్ట్రాటజీ. దీని ప్రకారం నెలవారీ ఖర్చుల్లో కేవలం 1% తగ్గించుకోవాలి. లేదా మీ సేవింగ్స్ను 1% పెంచాలి. చిన్న ఖర్చులను అంటే అనవసర సబ్స్క్రిప్షన్లు లేదా అదనపు డైనింగ్ ఖర్చులను కట్ చేసి ఆ మొత్తాన్ని SIP వంటి వాటిలో ఆటోమేట్ చేయాలి. జపాన్ టెక్నిక్ కైజెన్ లాగా ఈ చిన్న మార్పులే లాంగ్ టర్మ్లో మీ మీద భారం పడకుండా భారీ సంపదను క్రియేట్ చేస్తాయి.
News February 28, 2026
ఆంథ్రోపిక్కు ట్రంప్ ‘నో యూజ్’ షాక్

ఆంథ్రోపిక్ AI టెక్నాలజీ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ తమ అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. Claude AI సాఫ్ట్వేర్లోని సేఫ్గార్డ్స్ తొలగించి యుద్ధాల్లో వాడేలా చేయాలన్న పెంటగాన్ ఒత్తిడికి ఆ సంస్థ నిరాకరించడమే దీనికి కారణం. అటానమస్ వెపన్స్ తయారీకి సహకరించలేమని కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై మండిపడిన ట్రంప్.. సైన్యం ఎలా పోరాడాలో నిర్ణయించే అధికారం ఒక ప్రైవేట్ సంస్థకు లేదని పేర్కొన్నారు.
News February 28, 2026
పాక్ సెమీస్కు వెళ్లాలంటే..

ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. నేడు శ్రీలంకతో జరిగే చివరి S-8 మ్యాచ్లో పాక్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే లంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే ఛేజింగ్లో అయితే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అప్పుడే రన్ రేట్ పరంగా కివీస్ను వెనక్కి నెట్టి పాక్ సెమీస్కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది.


