News February 15, 2025

NGKL: ఈ నెల 19వ తేదీ నుంచి 24 గంటలూ అనుమతి

image

నాగర్ కర్నూల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతి ఉంటుందని శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణికులను, వాహనాలను అనుమతించరు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 27, 2026

రివార్డ్ పాలసీ రూ.కోటి ఇవ్వండి: దేవ్ జీ

image

TG ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ దేవ్ జీ అన్నారు. ఇవాళ CMతో భేటీ తర్వాత మాట్లాడారు. ‘రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరాం. ఐదెకరాల భూమి ఇవ్వడం సాధ్యం కాదని CM అన్నారు. ఇల్లు, ఉద్యోగం, జీవన భృతిపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైళ్లలో మావోయిస్టులను కలుస్తాం. అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం. తుపాకీ సిద్ధాంతం నడవదని వివరిస్తాం’ అని దేవ్ జీ తెలిపారు.

News February 27, 2026

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళం

image

హైదరాబాద్‌కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాత, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.

News February 27, 2026

పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కచ్చపి ఆడిటోరియంలో పబ్లిక్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ‘క్వాలిటీ రిజల్ట్’ మాత్రమే మన లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు.