News April 23, 2025

NGKL: ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి: సీపీఎం

image

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడికి వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.

Similar News

News April 23, 2025

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత: ఖమ్మం కలెక్టర్

image

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మా ఇంటి మణిద్వీపం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మధిర మండలం దెందుకూరులో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మన ఆలోచనల్లో మార్పు వస్తే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానంగా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు.

News April 23, 2025

కొమరాడ పిహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ

image

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మంచి వాతావరణం ఉండాలని, వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్యులు అరుణ్ ఉన్నారు.  

News April 23, 2025

జగిత్యాల: ఇందిరమ్మ ఇళ లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించుటకు అధికారులకు బుధవారం జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!