News December 3, 2025

NGKL: ఉపసంహరణ పూర్తి.. గుర్తుల కేటాయింపు

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పర్వం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నామినేషన్లు ఉపసంహరించుకున్న అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులను కేటాయించారు. ఉంగరం గుర్తుతో పాటు కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్ తదితర గుర్తులను కేటాయించారు.

Similar News

News December 3, 2025

రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

image

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.

News December 3, 2025

మంచిర్యాల: ఎన్నికల రోజు సెలవు

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు పోలింగ్ కోసం ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలకు ప్రభత్వ సెలవు ప్రకటించామన్నారు. పోలింగ్ రోజు ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర ఉద్యోగులకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.

News December 3, 2025

కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై జేసీ సమీక్ష

image

కోనసీమ జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమి స్తోందని, ఖరీఫ్ సీజన్(2025-26)కు సంబంధించి అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఉండాలన్నారు.