News March 28, 2025
NGKL: ఉప్పునుంతలలో 40.0 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా ఉప్పునుంతలలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వంగూర్, నాగర్ కర్నూల్ 39.9, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి 39.8, కోడేరు 39.7, బిజినపల్లి, చారకొండ 39.6, కొల్లాపూర్, కల్వకుర్తి 39.3, వెల్దండ 39.1, అచ్చంపేట 39.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News July 7, 2025
గొంతుకోసి చిన్నారి హత్య.. చిన్నమ్మే హంతకురాలు?

TG: జగిత్యాల కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ తగాదాలతో హితీక్షను చిన్నమ్మే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి బాత్రూమ్లో శవమై తేలింది. నిన్న చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, స్థానికులు హితీక్షకు కన్నీటి వీడ్కోలు పలికారు.
News July 7, 2025
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, RRRకు అనుమతులు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు.
News July 7, 2025
జనగామ: సీనియర్ V/S జూనియర్..!

జిల్లాలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రతి పార్టీలో సీనియర్ V/S జూనియర్ రాజకీయాలు నడుస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావాలని వేచి చూస్తున్నారు. అయితే జిల్లాలో యువత రాజకీయాల వైపునకు ఎక్కువ మొగ్గు చూపుతుండటం గమనార్హం.