News November 11, 2025

NGKL: ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రమేష్ ఎన్నిక

image

నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న K.రమేష్, స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. అలాగే, సీపీఎస్ రద్దు చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నికను జిల్లా సంఘం నేతలు హర్షించారు.

Similar News

News November 11, 2025

‘సిద్దిపేట జిల్లాకు అందెశ్రీ జిల్లాగా పేరు మార్చాలి’

image

సిద్దిపేట జిల్లా పేరును అందెశ్రీ సిద్దిపేట జిల్లాగా పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

News November 11, 2025

జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్‌కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.

News November 11, 2025

జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్‌కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.