News February 6, 2025

NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

image

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

Similar News

News March 1, 2026

భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదు: బండి

image

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు మస్కట్ వరకు రోడ్డు మార్గం గుండా చేరుకుని స్వదేశానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవచ్చన్నారు.

News March 1, 2026

ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

News March 1, 2026

ఈ నెల 3న మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం మూసివేత

image

చంద్రగ్రహణం నేపథ్యంలో మల్దకల్ గ్రామంలోని ప్రసిద్ధ ఆదిశిలాక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేయనున్నారు. మంగళ ఉ. 7 గంటలలోపు స్వామికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు చేసి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.