News March 21, 2024
NGKL: కన్న కొడుకును హత్య చేసిన తల్లి

ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 7, 2025
వనపర్తి: తమకు పెళ్లి చేయాలంటూ PSకు ప్రేమ జంట

తమకు పెళ్లి చేయాలంటూ ఓ ప్రేమ జంట PSకు వచ్చిన ఘటన వనపర్తి జిల్లా పానగల్లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేమద్దుల గ్రామానికి చెందిన నందిని(22), మహేందర్(29) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి PSలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబీకులతో పోలీసులు మాట్లాడి ఒప్పించారు. త్వరలో వారి పెళ్లి చేస్తామన్నారు.
News April 6, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కారుకొండకి చెందిన యాదమ్మ తన కుమారుడితో కలిసి బైక్పై పనిమీద బయటికెళ్లి తిరిగివస్తున్నారు. షాద్నగర్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందారు.
News April 6, 2025
మహబూబ్నగర్: శ్రీరాముని పాదం చూశారా?

MBNR జిల్లా కోయిలకొండలోని మహిమాన్విత క్షేత్రమైన శ్రీరామకొండ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదం స్వయంభుగా వెలసిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ తన పాదం మోపి సేదతీరినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే సమయంలో ఇక్కడ ఒక మూలికపడి కొండ మొత్తం వనమూలికలకు ప్రసిద్ధగా మారిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉండడం విశేషం.