News February 14, 2025
NGKL: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలో స్వయంభూ శ్రీకురుమూర్తి స్వామినీ గురువారం నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు, ఆలయ ఛైర్మన్ గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
అల్లూరి జిల్లాలో 11,598 గృహాలు ప్రారంభం

అల్లూరి జిల్లాలో నేడు 11,598 గృహాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పాడేరు నియోజకవర్గంలో సప్పిపుట్టు, అరకు నియోజకవర్గంలో సిమిలిగూడ, రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగలలో నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News November 12, 2025
సిద్దిపేట జిల్లాలో ఏసీబీ రైడ్స్!

సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఏసీబీ రైడ్స్ జరిగాయి. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ విజయ్ కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీకి చిక్కారు. ఎస్ఐ, కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 12, 2025
నేడు మేడారానికి నలుగురు మంత్రులు

ములుగు జిల్లా మేడారంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. రానున్న మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని, 12 గంటలకు అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.


