News March 10, 2025
NGKL: గురు ప్రీత్ సింగ్ కుటుంబ నేపథ్యం ఇదే..!

SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెంది 16 రోజులకు మృతదేహంగా బయటపడిన గురు ప్రీత్ సింగ్(40) కుటుంబ నేపథ్యం ఇదే. వీరిది పంజాబ్లోని చీమ కలన్ గ్రామంలో 1985లో జన్మించారు. తండ్రి విర్స సింగ్, ఎరెక్టర్ ఆపరేటర్గా పనిచేసేవారు. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీలో 2022లో రెగ్యులర్ ఉద్యోగిగా చేరారు. భార్య రాజ్విందర్ కౌర్ ఉన్నారు. ఆయన మృతదేహం బయటకు తేవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు.
Similar News
News December 15, 2025
నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు !

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తూ సోమవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్టలు నిషేధం అని తెలిపారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేల వాడకం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
News December 15, 2025
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.
News December 15, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్స్కు నో: సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డులెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.


