News April 21, 2025
NGKL: జర్నలిస్ట్లు గౌరవం కాపాడుకోవాలి: ఛైర్మన్

జర్నలిస్టులు క్రమశిక్షణతో మెలుగుతూ తగిన గౌరవం కాపాడుకోవాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదివారం సోమశిలలో జరిగిన TUWJ(IJU) రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న ఆయన NGKLలో మాట్లాడారు. మారిన కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు వృత్తిపరమైన శిక్షణలో మెలుకువలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News April 21, 2025
MDK: 9,970 GOVT జాబ్స్.. GET READY

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్కు మే 11 చివరి తేదీ. వెబ్సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281
News April 21, 2025
పీసీసీఎఫ్గా జిల్లా వాసికి అదనపు బాధ్యతలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి కార్యదర్శి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి PCCF, HOFSగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన అటవి శాఖ ప్రధాన కార్యాలయం ఆర్య భవన్లో PCCFగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో ఆయన బందువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
News April 21, 2025
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మరో 170 మంది తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరో 170 మందినియాజమాన్యం తొలగించింది. ఇప్పటివరకు 1500 వరకు ఉద్యోగులను తొలగించారు. అయితే కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మే 20వరకు ఎటువంటి చర్యలు ఉండవని చెప్పిన యాజమాన్యం తొలగింపులు ఆపడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాగా ఉన్నపలంగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు బోరున విలపిస్తున్నారు.