News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News December 15, 2025

HYD: ఫేమస్ బుక్స్.. షార్ట్ రివ్యూస్!

image

ఈనెల 19నుంచి NTRస్టేడియంలో బుక్ ఫెయిర్ ఉంది. ఏబుక్స్ కొనాలని యోచిస్తుంటే? మీకోసమే.
➥ఫ్రెడ్రిక్ నిషే ఫిలాసఫీ ‘మనిషి ఒంటేలాంటోండు..మోకరిల్లి బాధ్యతల బరువును భుజానేసుకొని జీవితం భారమైందని ఏడుస్తాడు’అని చెప్పింది ఈయనే. మనిషి సూపర్‌మ్యాన్ కాగలడని ఏకాంతంగా గడిపిన ‘జరతూస్త్రా’తో ప్రపంచానికి చెప్పారు. మనిషి బానిస గోడలను బద్దలుకొట్టే ఆలోచనలు పుట్టిస్తారు. నిషేను మరోలా అర్థం చేసుకుని హిట్లర్ WW ప్రకటించారు.

News December 15, 2025

KMR: తల్లి సర్పంచి.. కొడుకు డీసీసీ అధ్యక్షుడు

image

జిల్లా రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కొడుకు కీలక పదవులు దక్కాయి. ఏలే మల్లికార్జున్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా తల్లి ఏలే సుగుణమ్మ నిజాంసాగర్ మండలం బంజేపల్లి సర్పంచిగా భారీ విజయం సాధించారు. ఇదే గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ బలాన్ని చాటుతోంది.

News December 15, 2025

AP న్యూస్ రౌండప్

image

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.