News March 14, 2025
NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.
Similar News
News March 14, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ 172 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు
➤ కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు
➤ నంద్యాల: వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు
➤ స్త్రీల వేషంలో పురుషులు.. రతీ మన్మథులకు పూజలు
➤ మంత్రాలయంలో కన్నడ సీరియల్ షూటింగ్
➤ ఆదోని: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పెద్దకడబురు విద్యార్థులు
➤వైఎస్ జగన్ పై సోమిశెట్టి తీవ్ర విమర్శలు
News March 14, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ పాణ్యంలో ఎండ ధాటికి స్కూటీ దగ్ధం
☞ ఎస్సీ వర్గీకరణ అధ్యయనానికి సభ్యుడిగా మంత్రి బీసీ
☞ YCP నేతపై హత్యాయత్నం.. 9 మంది TDP నేతలపై కేసు
☞ హత్యాయత్నం కేసులో ఇద్దరికీ 7 ఏళ్ల జైలు శిక్ష
☞ సంతేకుడ్లూరులో వింత ఆచారం.. స్త్రీ వేషధారణలో పురుషులు
☞ బ్రాహ్మణకొట్కూరు విద్యార్థినికి బంగారు పతకం
☞ కోవెలకుంట్ల జాబ్ మేళాలో 38 మందికి ఉద్యోగాలు
☞ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు
News March 14, 2025
వర్తు వర్మ.. ‘వారి కర్మ’

AP: పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా <<15761376>>వ్యాఖ్యలు<<>> YCPకి అస్త్రంగా మారాయి. వర్మ సపోర్టు వల్లే తాను అక్కడ గెలిచానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు ’వారి కర్మ’ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.