News October 29, 2025

NGKL: డిండి మైనర్ బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

జిల్లాలోని డిండి ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న మైనర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. పరిశీలించిన అనంతరం స్థానిక పోలీసులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Similar News

News October 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 30, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 30, 2025

తాజా సినిమా ముచ్చట్లు

image

✦’అరుంధతి’ సినిమా హిందీలోకి రీమేక్? ప్రధాన పాత్రలో శ్రీలీల నటించనున్నట్లు టాక్
✦ నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్యూడ్’ సినిమా స్ట్రీమింగ్?
✦ తెలుగు డైరెక్టర్ పరశురామ్‌తో సూర్య సినిమా చేసే అవకాశం?
✦ ‘రిపబ్లిక్’ సినిమాకు సీక్వెల్.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది: సాయి దుర్గ తేజ్
✦ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా

News October 30, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.