News April 14, 2025
NGKL: డీఎస్పీ నుంచి బీఎస్పీలోకి చేరికలు

BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మిద్దె శివప్రసాద్ (నాగర్ కర్నూల్), పంజుగుల శంకర్ (కల్వకుర్తి), మల్లెపాకుల సైదులు (అచ్చంపేట) ధర్మ సమాజ్ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో సోమవారం చేరారు. మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానందరావు, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అంతటి నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో మార్చి 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
News February 27, 2026
రెంటచింతలలో వివాహిత ఆత్మహత్య

రెంటచింతల మండలం మంచికల్లులో కుటుంబ కలహాల నేపథ్యంలో బంకూరి మల్లేశ్వరి (35) అనే వివాహిత గురువారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి, ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
News February 27, 2026
రేపు, ఎల్లుండి ఏపీలో సీజేఐ పర్యటన

AP: CJI జస్టిస్ సూర్యకాంత్ 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుపతిలో 16 కోర్టుల భవన నిర్మాణానికి ఎల్లుండి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరావతికి చేరుకొని AP జుడీషియల్ అకాడమీ, హైకోర్టు గెస్ట్హౌస్లకు భూమిపూజ చేస్తారు. హైకోర్టు వద్ద నిర్మించిన న్యాయమూర్తుల నివాసాలను ప్రారంభిస్తారు. గవర్నర్ జస్టిస్ నజీర్, CM CBNతో కలిసి సభలో పాల్గొంటారు.


