News November 23, 2024
NGKL: దారుణం.. భర్తను హత్య చేసిన భార్య, కూతురు

NGKL జిల్లా తెలకపల్లి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాలు.. వట్టిపల్లికి చెందిన ఈశ్వరయ్యను భూమి అమ్మకం విషయమై తన భార్య ఎల్లమ్మ, బావమరిది బాలస్వామి, పెద్దకూతురు స్వాతి, పెద్దఅల్లుడు మల్లేశ్, మరదలు ఆశమ్మలు హత్య చేశారు. గొడ్డలితో దాడిచేసి, మర్మాంగాన్ని కత్తిరించి హతమార్చారు. మృతుడి చెల్లెలు నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI కనకయ్య గౌడ్ తెలిపారు.
Similar News
News May 8, 2025
మహబూబ్నగర్ రూరల్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
News May 8, 2025
మహబూబ్నగర్ రూరల్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
News May 8, 2025
తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.