News March 30, 2025
NGKL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News September 18, 2025
వర్షపు నీటిని పొదుపు చేయాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో భూగర్భ నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని, భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని ప్రజలు పొదుపుగా వినియోగించాలన్నారు.
News September 18, 2025
ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి

ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును, మధ్యాహ్న భోజనం, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు.
News September 18, 2025
VKB: అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా ఆధునికీకరణ పనులు, ఏరియా ఆసుపత్రిలోని సివిల్ మరమ్మతులను స్పీకర్ ప్రసాద్ కుమార్ పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.